UA-35385725-1 UA-35385725-1

మే 10న జర్నలిస్టుల జాతీయ నిరసనదినం!

సమస్యల పరిష్కారానికై మే 10న జర్నలిస్టుల జాతీయ నిరసనదినం!

ఐ.జే.యూ. పిలుపు!

IJU: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 10 న “జాతీయస్థాయి నిరసనదినం” పాటించాలని ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర నగరంలోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో జరుగుతున్న రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగళవారం సాయంత్రం ముగిశాయి.

సమావేశాలకు ఐ.జే.యు. అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కుంటున్న వృత్తిపరమైన సమస్యలపై , ప్రభుత్వాల విధానాలపై సమావేశం లోతుగా చర్చించింది. జర్నలిస్టుల హక్కులను కాలరాయడంలో , జర్నలిస్టులకు ఎన్నోఏళ్ళుగా అమల్లో ఉన్న సదుపాయాలను రద్దు చేయడంలో కేంద్రప్రభుత్వం ముందంజ వేస్తుండగా , పలురాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అదేబాటలో పయనిస్తున్నాయని సమావేశంలో మాట్లాడిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వెల్లడించారు.

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఒక జాతీయస్థాయి ఉద్యమాన్ని చేపట్టాలని కార్యవర్గసమావేశం నిర్ణయించింది. మే 10 వ తేదీన అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జర్నలిస్టుల నిరసనదినం పాటించాలని , సమస్యలపై దృష్టి సారించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఐ.జే.యు. పిలుపు ఇచ్చింది.

వివిధరూపాలలో నిరసన వ్యక్తం చేయడంతో పాటు కేంద్రమంత్రులకు ,ఎంపీలకు వినతిపత్రాలు అందచేయాలని అనుబంధ సంఘాలకు పిలుపు ఇచ్చింది. దేశంలో మీడియా రంగంలో ఉన్న అన్ని వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడంపై ఐ.జే.యు. తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫార్సు మేరకు వెంటనే మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఐ.జే.యు. డిమాండ్ చేసింది.

మీడియా విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతున్న ప్రస్తుత తరుణంలో , మీడియా కౌన్సిల్ ఏర్పాటు అత్యంత అవసరమని ఐజేయూ అభిప్రాయపడింది. మీడియా సిబ్బందిపై పెరిగిపోతున్న దాడులను ఐ.జే.యు. ఒక తీర్మానంలో ఖండించింది. జమ్మూ కాశ్మీర్ పాత్రికేయులపై నిర్బంధకాండను ఖండిస్తూ సమావేశం మరో తీర్మానాన్ని ఆమోదించింది.

కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దుచేయడంతో ,ఇప్పటికే జర్నలిస్టులకు అరకొరగా మిగిలిన ఉద్యోగభద్రత , వేతనభద్రత పూర్తిగా ప్రశ్నార్థకం అయ్యాయని ,కాంట్రాక్ట్ విధానమే చట్టబద్దం అయ్యిందని ఐ.జే.యు. విమర్శించింది. ప్రెస్ కౌన్సిల్ ను నీరు కార్చడాన్ని, అందులో జర్నలిస్ట్ యూనియన్ల ప్రాతినిధ్యం లేకుండా చేయడాన్ని ఐజేయు తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రెస్ కౌన్సిల్ కు వెంటనే చైర్మన్ ను నియమించాలని , కౌన్సిల్ లో జాతీయ పాత్రికేయ సంఘాల ప్రాతినిధ్యాన్ని పునరుద్ధరించాలని కోరింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్రెడిటేషన్ నియమాలని ఏకపక్షంగా మార్చడాన్ని ఐజేయు ఖండించింది.

కరోనా సందర్భంగా రైల్వే ప్రయాణాల్లో పలు రాయితీలను రద్దు చేసిన రైల్వేశాఖ వాటిని ఇటీవల పునరుద్ధరించిన సందర్భంగా జర్నలిస్టుల ప్రయాణ రాయితీ సదుపాయాన్ని పునరుద్ధరించకపోవడాన్ని ఐజేయూ తప్పు బట్టింది. రైల్వేలో జర్నలిస్టుల ప్రయాణరాయితీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేపట్టాలని కార్యవర్గసమావేశం నిర్ణయించింది.

రెండురోజుల కార్యవర్గ సమావేశంలో ఐ.జే.యు. సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ , పూర్వాధ్యక్షుడు ఎస్.ఎన్. సిన్హా , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా ,అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్ , జాతీయఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు , జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి , వి.బి.రాజన్ ,(కేరళ )డి.ఎస్.ఆర్.సుభాష్ ,(తమిళనాడు) అమర్ మోహన్ (బీహార్) బంత్ సింగ్ బ్రార్ (హర్యానా) కోశాధికారి ప్రేమ్ నాథ్ భార్గవ్ (న్యూఢిల్లీ) స్క్రైబ్స్ న్యూస్ పత్రిక సంపాదకుడు ఆలపాటి సురేష్ కుమార్ , రమేష్ శంకర్ పాండే ,(యూపీ) గిరీష్ పంత్ ( ఉత్తరాఖండ్ ) డి.సోమసుందర్ ( ఆంధ్ర ప్రదేశ్) కే. విరాహత్ ఆలీ ( తెలంగాణ ) జి.శ్రీనివాస్ ( మహారాష్ట్ర ) మత్తి మహారాజ్ ( పాండిచ్చేరి ) దాసరి కృష్ణారెడ్డి ( తెలంగాణా) తదితరులు మాట్లాడారు.

ఐజేయు పదవ ప్లీనరీ సమావేశాలను అక్టోబర్ లో తమిళనాడులో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. అంతకు ముందే రాష్ట్రాల మహాసభలను పూర్తి చేయాలని , సభ్యత్వాలను కోటా మొత్తాన్ని కేంద్రానికి చెల్లించాలని కార్యవర్గం రాష్ట్ర సంఘాలను ఆదేశించింది. ఐజేయు జాతీయఅధ్యక్షుడు , సెక్రెటరీ జనరల్ ,జాతీయకౌన్సిల్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు సెంట్రల్ రిటర్నింగ్ అధికారిగా ఎం. ఏ. మాజిద్ ను సమావేశం నియమించింది. (Story: మే 10న జర్నలిస్టుల జాతీయ నిరసనదినం!)

See Also: 

కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌…ఎందుకంటే?

అది గోడకాదు..రూ.10 కోట్లు,19 కేజీల వెండి ఇటుకలు

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి: ఏ పార్టీలో చేరుతారంటే?

సైబర్‌ దగా: వెంకయ్యనాయుడు పేరుతో వీఐపీలకు గాలం!

జనసైనికులపై చేయిపడితే…సహించేదిలేదు

17 ఏళ్ల అమ్మాయిని గర్భవతిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి

భద్రాచలానికి రైలు…ఏపీని టచ్‌ చేయదు!

ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం!

మద్యం ప్రియులకు మరో మత్తకబురు!

డ్యాన్స్‌ చేస్తే రూ.65 కోట్లు : ఆమెలో ఏమిటా స్పెషాలిటీి?

మట్టి మాఫియా ఆగడాలు : ఆర్‌ఐపై హత్యాయత్నం (వీడియో వైర‌ల్‌)

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది…ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌నైట్‌ భయంతో వరుడు ఆత్మహత్య!

నగ్నంగా మహిళ ఊరేగింపు!

కిరాతకం: మైనర్‌ బాలికపై 80 మంది అత్యాచారం!

వారి ప్రేమను కాదనలేక…కోడలికి పెళ్లిచేసిన అత్తామామలు!

యమడేంజర్‌: ఎంతపని చేసింది…గొంతు కోసింది!

రూ.100 కోసం అన్నను చంపిన తమ్ముడు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ : పేలిన ల్యాప్‌టాప్‌

ఇంట్లో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం చూసిన వాలంటీర్ ఏం చేశాడో తెలుసా?

కన్నతల్లిని పదేళ్లు బంధించిన క‌సాయి కొడుకులు : వారానికోసారి కుక్కబిస్కెట్లు!

భర్త క్రూరత్వం: భార్యనే గ్యాంగ్‌రేప్‌ చేయించాడు!

ఉప్పు ఎక్కువైందని.. భార్య పీకనులిమేశాడు!

కొంపముంచిన హస్త ప్రయోగం : యువకుడు ఆసుపత్రిపాలు

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1