UA-35385725-1 UA-35385725-1

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

హైదరాబాద్‌: కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడమేమిటి? ఆంధ్రావాళ్లు కోట్లాది రూపాయలు జేబుల్లో నింపుకోవడమేమిటి? ఇది వింటే ఆశ్చర్యంగా వుంది కదూ! కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్యాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి జీవో నెంబరు 111ను రద్దు చేసిన విషయం తెల్సిందే. ఈ జీవో రద్దుతో ఆంధ్రాకు చెందిన పెద్ద పెద్ద తలకాయలంతా కోట్లాది రూపాయలను ఆర్జించనున్నారు. అదెలాగంటే…?
ఎప్పటినుంచో తెలంగాణలో తలనొప్పిగా వున్న జీవో నెంబరు 111ను కేసీఆర్‌ ప్రభుత్వం ఈమధ్యనే ఎత్తివేసింది. ఈ జీవోను ఎత్తివేయడంతో ఇకముందు హైదరాబాద్‌ శివారు భూములు ఒక్కసారిగా బంగారమయం కానున్నాయని కథనాలు చదివే వున్నాం. ఈ ఏరియాలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్దమనుషుల జేబుల్లోకి మరిన్ని కోట్ల కాసులు రాలనున్నాయి. ఇకముందు ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ కొత్త రికార్డులను సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అక్కడ వందల సంఖ్యలో ఫాంహౌజ్‌లు వెలిసాయి. విల్లాలను నిర్మించారు. భూ క్రయవిక్రయాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టినవారంతా ఆంధ్రాకు చెందిన వారేనన్న విషయం అందరికీ తెల్సిందే. అప్పట్లోనే రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల ప్రాంతాలకు చెందిన మహామహులంతా హైదరాబాద్‌ శివారు ప్రాంతాలపై కన్నేశారు. అంతేకాదు. దొరికిన భూమిని దొరికినట్లుగా కొనేశారు. హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పడిన తర్వాత 60 శాతం భూములను ఆంధ్రావాళ్లు కొనేసి అట్టిపెట్టుకున్నారు. ఆ మధ్య ఇటు నల్గొండ వరకు, అటు మహబూబ్‌నగర్‌ వరకు, ఇంకోవైపున దాదాపు మెదక్‌ శివార్లు వరకు, దానికి వ్యతిరేక దశలో వున్న యాదాద్రి భువనగిరి, జనగాం ప్రాంతం వరకు భూములను కొనుగోలు చేశారు. రియల్‌ఎస్టేట్‌ వెంచర్లను కూడా భారీగా వేశారు. అయితే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడిపోయింది. పెద్దలు కొనుగోలు చేసిన భూములపై కూడా కిమ్మనకుండా ఉండిపోయారు. ఆ తర్వాత తెలంగాణ రావడం, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రం కావడం, విజయవాడకు మకాం మార్చడం..ఇలా చకచకా జరిగిపోయాయి. అయితే ఈనాటికీ అక్కడ భూముల్లో కనీసం 60 శాతం భూములు ఇంకా పైన పేర్కొన్న ఆంధ్రా జిల్లాలకు చెందిన పెద్దల చేతుల్లోనే వున్నట్లు అంచనా.
ఇదిలావుండగా, మరోవైపు రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాంతంలో కూడా నల్గొండ పెద్దలు, వ్యాపారులు సొంతం చేసుకున్న భూములు, అలాగే, టీఆర్‌ఎస్‌ నేతలు ముందస్తు సమాచారంతోనే కొనుగోలు చేసిన భూములు మినహాయిస్తే, మిగిలిన భూముల్లో చాలావరకు నేటికీ ఆంధ్రా పెద్దమనుషుల చేతుల్లోనే వున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. జీవో 111 పరిధిలో 1,32,600ఎకరాల భూమిని గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవో ఇచ్చినట్లు చెప్పారు. అయితే హైదరాబాద్‌ నగరానికి ఈ జలాశయాలు నీరు ఇఫ్పుడు అవసరం లేదని, ఇంకో వందేళ్ల వరకు హైదరాబాద్‌కు నీటి కొరత ఉండదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ జీవో 111ను ఎత్తివేసేందుకు ఆమోదముద్ర వేసింది. దీంతో 111జీవో పరిధిలో ఉన్న భూములు బంగారం కానున్నాయి. హైదరాబాద్‌ పట్టణానికి తాగునీరందించే జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ను కాపాడేందుకు అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం. వ్యవసాయ రంగానికి తప్పా ఎలాంటి భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 111 జీవోను ఎత్తివేస్తామని రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలు ఇచ్చాయి.
రంగారెడ్డి జిల్లాలో 1,32,000ఎకరాల్లో ఈ జీవో విస్తరించి ఉంది. హైదరాబాద్‌ మహానగర శివారులో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌, శంషాబాద్‌ మండలాలు పూర్తిగా వికారాబాద్‌ జిల్లాలోని శంకర్‌ పల్లి, చేవెళ్ల, షాద్‌నగర్‌, షాబాద్‌ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి ఏకంగా 84 గ్రామాలు జీవో 111 పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు ఈ జీవో 111ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా దాన్ని ఎత్తివేయడంతో కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు అక్కడ భూములు కలిగివున్న వారి పంట పండిరది. 111 జీవో పరిధి రంగారెడ్డి, వికారాబాద్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలకు సంబంధించినది మాత్రమే అయినప్పటికీ, అక్కడి వరకు నివాస ప్రాంతాలు అభివృద్ధిచెందితే, అక్కడి నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాంతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఏరియాలో భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. ఇప్పటికైనా అర్థమైందా? కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రా పెద్దమనుషులు ఏ మేరకు లబ్ధిపొందబోతున్నారో! జీవో 111 రద్దు వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు బాగుపడుతుందో పక్కనబెడదాం. టీఆర్‌ఎస్‌ మంత్రులు, వారి అనుయాయులు, ఈ ప్రాంత భూకామాందులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఏ మేరకు బాగుపడతారో అది కూడా పక్కనబెడదాం. ఈ ప్రాంతంలో చాలా వరకు భూములు, ఆస్తులు కలిగివున్న ఆంధ్రా పెద్ద మనుషులు మాత్రం బాగుపడతారన్నది వాస్తవం.

జీవో 111 పూర్వ గాథ ఇదీ!

సికింద్రాబాద్‌ వైపు కంటోన్మెంట్‌ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని తెలంగాణ మంత్రివర్గం అభిప్రాయ పడిరది. హైదరాబాద్‌ త్రాగునీటి అవసరాలు, గండిపేట, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆ జలాశయాల క్యాచ్‌మెంట్‌ ఏరియాలో నిర్మాణాలు చేయకూడదని గతంలో 111 జీవో అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నగర త్రాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్‌ సాగర్‌ పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల త్రాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో 111 జీవో ఉద్దేశం దెబ్బతిన్నది. ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న క్యాబినెట్‌ 111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో గండిపేట, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ జలాశయాల ద్వారా త్రాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రిగారు అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వదలడానికి తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ రెండు జలాశయాలు ఉపయోగంలోఉంటాయి. మూసీ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నగర పర్యావరణం మెరుగుపడుతుంద. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం చీఫ్‌ సెక్రటరీగారి అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమనిబంధనలను ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినేట్‌ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలు లేకుండా కొత్త జీవోను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆమోదం ద్వారా రూపొందించాలని ముఖ్యమంత్రిగారు కమిటీని ఆదేశించారు. (Story: కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు)

See Also: 

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఏపీ జనానికి షాక్‌…భారీగా ఆర్టీసీ వాత!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

దేవుడా! ఇదేం ఖ‌ర్మ‌! తిరుపతిలో నరకయాతన

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

ఆ దిష్టిబొమ్మ సీఎం జగన్‌దేనా?

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు ధియేట‌ర్ల షాక్‌!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1