Home వార్తలు జాతీయం వ్యాక్సిన్లనూ వదలరా?

వ్యాక్సిన్లనూ వదలరా?

0
Narendra Modi
Narendra Modi

వ్యాక్సిన్లనూ వదలరా?
టీకాలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని ఖండిరచిన ప్రధాని మోడీ
డెహ్రాడూన్‌ : కొవిడ్‌ టీకాలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య విమర్శనాస్త్రాలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా ప్రధాని మోడీ కూడా స్పందించారు. కరోనా వ్యాక్సిన్ల విషయంలో కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని నరేంద్రమోడీ విమర్శించారు. ఉత్తరాఖండ్‌ ఎన్నికలు పురస్కరించుకొని శనివారం రుద్రపూర్‌లో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేదేమీ లేకపోవడంతో కోవిడ్‌ టీకాలను రాజకీయాలకు వాడుకుంటుందని మండిపడ్డారు. ఇటీవల మరణించిన దేశ ప్రథమ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ను కాంగ్రెస్‌ నిందిస్తోందని ఆరోపించారు. జనరల్‌ రావత్‌ను అవమానిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఉత్తరాఖండ్‌ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించిందని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు ఉచితంగా బియ్యం అందజేశామని, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇలా చేయలేదన్నారు. కోవిడ్‌ కాలంలో ఏ ఒక్క పేదవాడిని ఆకలి కడుపులతో పండుకోనివ్వలేదన్నారు. ఉత్తరాఖండ్‌ అభివృద్ధి విషయంలో బీజేపీని ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేరని, రాష్ట్రంలో రోడ్లు, రైల్వే, విమానాల అనుసంధానం పనులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు చేసిందని మోదీ చెప్పారు.(Story :వ్యాక్సిన్లనూ వదలరా?)

‘హిజాబ్‌’పై రచ్చరచ్చ!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version