UA-35385725-1 UA-35385725-1

కోటిస్తే పేరుపెడ‌తా

కోటిస్తే పేరుపెడ‌తా
హైదరాబాద్ – పాఠ‌శాల‌కు కోటి రూపాయ‌లు ఇస్తే ఆ పాఠ‌శాల‌కు వారి పేరు పెడ‌తామ‌ని ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ముం దుకు వచ్చి రూ. కోటి లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే వారు సూచించిన పేరును ఆ పాఠశాలకు పెడతామని మంత్రి అన్నారు. రూ.పది లక్షలు లేదా అంతకు మించి ఆర్థిక సహకారం అందిస్తే ఆయా క్లాస్‌ రూమ్‌కి వారు సూచించిన పేరు పెట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు తమకు తోచినంత మేరకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముందుకు వచ్చే వారందరికీ కూడా ప్రత్యేక వెబ్‌ సైట్‌ రూపొందించిన తద్వారా డొనేషన్లు తీసుకోనున్నట్లు మంత్రి కెటిఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు భాగస్వాములు కావాలని కెటిఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్‌ఆర్‌ఐలతో శనివారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి కె తారకరామారావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకొని మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు నూతనంగా వందలాది విద్యాసంస్థలను ఏర్పాటు చేశామని, లక్షలాది మంది విద్యార్థులకు అత్యుత్తమ సౌకర్యాలతో విద్యను అందిస్తున్నామని, వాటికి సంబంధించిన ఫలాలు అందుతున్న విషయాన్ని కెటిఆర్‌ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలు, వాటి ద్వారా విద్యార్థులు సాధిస్తున్న విజయాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. నూతన విద్యా సంస్థల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సైతం బలోపేతం చేసి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టిందని మంత్రి కెటిఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 7289 కోట్ల రూపాయలతో, దాదాపు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివద్ధి చేయనున్నట్లు మంత్రి కెటిఆర్‌ తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంలాగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ర్టం నుంచి ఇతర దేశాలకు వెళ్లి అభివద్ధి చెందిన తెలంగాణ బిడ్డల భాగస్వామ్యాన్ని ఈ విషయంలో కోరుతున్నట్లు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ఉదాత్తమైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు.తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు త్వరలోనే సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ దేశాలలో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు కలిసిరావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమ గ్రామాలు లేదా తాము ఎంచుకున్న ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు లేదా వాటి అభివృద్ధికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చే ఎన్నారైల అందరికీ విద్య శాఖ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆమె తెలిపారు. (Story :కోటిస్తే పేరుపెడ‌తా)

See Also : జనవరిలో హైదరాబాద్‌లో 5,568 అపార్ట్‌మెంట్ల అమ్మకాలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1